నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

వార్తలు

38 వార్తలు కనుగొనబడ్డాయి

వార్తలు

దబ్బంద టిడ్కో కాలనీ సందర్శించిన గంటా

ఆనందపురం, మే 20: ఆనందపురం మండలం దబ్బంద గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం సందర్శించారు. కాలనీ ప్రజల సమస్యలను ఆయన అడిగి తీసుకున్నారు. టిడ్కో కాలనీలో 1,920 యూనిట్లు ఉండగా.. సరైన సౌకర్యాలు లేకపోవడంతో కేవలం 10- 15 శాతం మంది నివాసముంటున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద సబ్సిడీ ధరకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయించారు. బ్యాంకులకు ఈ.ఎం.ఐ.లు కట్టలేక, కనీస వసతులు లేని దబ్బంద టిడ్కో ఇళ్లల్లో ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. బ్యాంకు నుంచి తీసుకున్న  రుణాలు రద్దు చేయాలని కోరారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పార్కు, ఆరోగ్య కేంద్రం, రేషన్ డిపో, ప్రజా రవాణా వంటి ప్రాథమిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళ్లలో వీధి దీపాలు వెలగకపోవడం వల్ల మహిళలకు రక్షణ కరువవుతోందని, చెత్తా చెదారం పేరుకుపోవడంతో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. అలాగే స్మశాన వాటిక నిర్మించాలని విన్నవించారు. త్వరలో జరిగే జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశంలో టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చించి, పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని గంటా హామీ ఇచ్చారు. అంతకుముందు కాలనీలో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనుబాబు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, టిడ్కో ఎస్.ఈ. రామిరెడ్డి, ఈఈ సుధాకర్, డీఈ రాజేష్, ఏఈ అనూష, సి.ఎల్.టి.సి. దేముడు బాబు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, గండ్రెడ్డి సోమినాయుడు, లొడగల వెంకట్రావు, బలిరెడ్డి మల్లికార్జునరావు, మదపాటి శ్రీను, గండ్రెడ్డి రమేష్, కాళ్ల నగేష్ కుమార్, అప్పలరాము, ఎర్ర రాజు, బోని ప్రసాద్, శివ, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VENKATA RAO· 3 వారాల క్రితం
వార్తలు

ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల తో నిర్వహించాలి

మద్దిలపాలెం : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం వాల్తేరు డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ అధ్యక్షులు ఎ కె శివాజీ ముఖ్య అతిథిగా విచ్చేసారు.గేట్ మీటింగ్ ను ఉద్దేశించి శివాజీ మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కనుగోలు చేయాలని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్త్రీ శక్తి బస్సులలో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మగవారికి మాత్రమే టికెట్ ఇచ్చే విధానం ద్వారా మహిళలు ఉచితంగా ఎటువంటి టికెట్ తీసుకోకుండా ప్రయాణించేలా చేయాలని ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని కొత్త టిమ్ లు ఏర్పాటుచేయాలని పి ఆర్ సి కమిటీని నియమించి ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డి ఎ ఆరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇవ్వాలని గౌరవ ఎండి గారికి ఇచ్చిన మెమోరాండంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలని రిటైర్ అయిన చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్స్ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఇ ఎచ్ ఎస్ నుండి మినహాయించి గతంలో ఆర్టీసీ నందు ఉన్న వైద్య సదుపాయం అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని రాష్ట్ర కమిటీ కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఉద్యోగులను ముందుగా వాల్తేరు డిపో అధ్యక్షులు ఆర్ వసంతరావు చైతన్యపరిచారు ఈ గేటు మీటింగ్ లో రాష్ట్ర కార్యదర్శి పిజిపతి కార్యదర్శి ఎస్ యం నాయుడు డి ఎస్ ఆర్ రాజు గ్యారేజీ అధ్యక్షకార్యదర్శులు గ్యారేజ్ ఉద్యోగులు. సి సి ఎస్ డెలిగేట్ కె టి రావు అత్యధిక సంఖ్యలో యూనియన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు,

PRASAD · 3 వారాల క్రితం · Andhra Pradesh
వార్తలు

రైతాంగ సమస్యలు పరిష్కారానికై రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయండి

మునగపాక :రైతు సంఘం తొమ్మిదవ జిల్లా మహాసభ మే 23 న మునగపాక రాధాకృష్ణ ఏసీ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభమవుతాయని సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు ఈ మహాసభలో రైతు సమస్యలపై రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఎరువులు ధరలు తగ్గించాలని అవసరమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20000 రూపాయలు ఇవ్వాలని భూనిర్వాస్తులు 2013 చట్ట ప్రకారం న్యాయం చేయాలని తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారు కావున ఈ సభలో అచ్యుతాపురం లో ఉన్న రైతులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తోట వెంకటేష్ మైలపల్లి రమణ నడుపూరు సోంబాబు కొల్లి రాము కూండ్రపు సన్యాసిరావు కూండ్రపు సన్నిబాబు కూండ్రపు అప్పారావు తట్ట అప్పారావు లాలం రాము ధర్మ రెడ్డి సత్యనారాయణ పిల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

JAGAN · 3 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి : ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అన్నారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసి రూ.20వేలు ఇస్తోందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోందని... 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి జరుగుతోందని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు.  మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు.

CHANDU · 3 వారాల క్రితం · Andhra Pradesh, Tirupati
వార్తలు

\రేపటినుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

ఎచ్చర్ల ( న్యూస్ వన్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతాయని ఆర్.ఐ ఓ కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ 51 కేంద్రాలలో 23,527 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నార అని అన్నారు .వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 14181 మంది ద్వితీయ సంవత్సరం 9346 మంది పరీక్షలు హాజరు అవుతారని అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష లకు,హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RAMA RAO · 3 వారాల క్రితం · Andhra Pradesh, Vizianagaram
ప్రకటన (Advertisement)
వార్తలు

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం

నూరుశాతం ఎన్ రోల్ మెంట్ పై అధికారులు దృష్టిసారించాలిప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలిప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశంఅమరావతి: దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం, అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నా. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... క్వాలిటీ మెరుగుపర్చకపోతే నష్టపోయేది పిల్లలు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఓపెన్ మార్కెట్ తో పోటీపడాలి. ఇందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశాం. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ నా లక్ష్యం, ఇందుకోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు.బిడ్డల భవిష్యత్తు కేంద్రంగా నిర్ణయాలుఈ సమావేశం కేవలం సమీక్ష కోసం కాదు, యాక్షన్ ప్లాన్ కోసం ఏర్పాటుచేశాం. నేను విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో రాష్ట్రస్థాయి విజిబిలిటీ, కనీస డేటా అందుబాటులో లేదు. పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడే నేను కేవలం మూడునెలల్లో పూర్తిస్థాయి సమాచారంతో డ్యాష్ బోర్డు తయారుచేశాం. విద్యాశాఖలో కనీస డేటా బేస్ అందుబాటులో లేని పరిస్థితి నుంచి విద్యాశాఖలో నా ప్రయాణం ప్రారంభించాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మన సొంత బిడ్డల్లా భావించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బిడ్డల భవిష్యత్ కేంద్రంగా నిర్ణయాలు ఉండాలి. డ్యాష్ బోర్డు ప్రకారం యాక్షన్ ప్లాన్ దిశగా డీఈవోలు, ఏపీసీలు పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది పిల్లలు డ్రాపవుట్స్ గా ఉన్నారు. నెవర్ ఎన్ రోల్డ్ పై కూడా ఫోకస్ చేయాలి. నూరుశాతం ఎన్ రోల్ మెంట్ పై అధికారులంతా దృష్టిపెట్టాలి. యువగళం పాదయాత్ర సమయంలో నేను కర్నూలు జిల్లాలో పర్యటించేటప్పుడు వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పొలం పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో ప్రాపర్ ట్రాక్ మెకానిజం ఉండాలి.ఉద్యమంలా జీఎఫ్ఎల్ఎన్ చేపట్టాలిలెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ను ఒక ఉద్యమంగా అమలుచేయాలి. వాస్తవాలు తెలుసుకున్నపుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. నిజం చేదుగా,  అబద్ధంగా తీయగా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరిస్తేనే మన ప్రయాణం సరైన దిశగా సాగుతుంది. మేం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు సరైన సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం 9వ తరగతికి క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేస్తున్నాం, క్రోమ్ బుక్స్ అందించబోతున్నాం. నూరుశాతం జీఎఫ్ఎల్ఎన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. 5శాతం వెనుకబడటం అంటే సాధారణమైంది కాదు. వాస్తవంలో అది లక్షల సంఖ్యలో ఉంటుంది. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10శాతం ఎన్ రోల్ మెంట్ ఇంప్రూవ్ చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం సమిష్టిగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం నింపిన విద్యాశాఖ ప్రకటనప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్, ప్రతిభావంతమైన టీచర్లు ఉన్నారు. పదోతరగతి ఫలితాలపై ఇటీవల తొలిసారి ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల ప్రణాళిక బాగా ఉపకరించింది. అది అవసరం లేకుండానే ట్రాన్సిషన్ జరిగాలి, ఫౌండేషన్ పకడ్బందీగా ఉండాలి. దానిపై అధికారులంతా శ్రద్ధ వహించాలి. రెండేళ్లలో రాష్ట్రమంతటా స్మార్ట్ కిచెన్లురాష్ట్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల మౌలిక  సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ ప్రవేశపెట్టాం. దీనిపై అధికారులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిటికల్ ఇన్ ఫ్రా కోసం ప్రభుత్వం నుంచి నిధులిస్తున్నాం. ఇందుకోసం అవసరమైతే దాతల సహకారం తీసుకోండి. ప్రతి పాఠశాలకు లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, టాయ్ లెట్, బెంచిలు కచ్చితంగా ఉండాలి. బేసిక్ ఇన్ ఫ్రా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలన్నదే మా ధ్యేయం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడపలో స్మార్ట్ కిచెన్ అద్భుతంగా చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుచేస్తాం.ఇంటర్నేషనల్ స్కూలుగా నిడమర్రు పాఠశాలమంగళగిరి నియోజకవర్గం నిడమర్రు స్కూలును ఇంటర్నేషనల్ స్కూలుగా తీర్చిదిద్దుతున్నాం. అక్కడ తొలిసారి నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. నెల్లూరులో కూడా రెండు స్కూల్స్ ను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దాలని అధికారులను కోరుతున్నా. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనే కాన్సెప్ట్ అమలులో ఉంది. నిడమర్రులో మేం కల్పించిన అత్యుత్తమ సౌకర్యాల వల్ల పక్క నియోజకవర్గాల వారు మా నియోజకవర్గానికి తమ బిడ్డల అడ్మిషన్ కోసం నివాసం మార్చుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కల్పించే లక్ష్యంతో పనిచేయాలి. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నా.బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలినేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు తెచ్చా. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టిపెట్టాలి. అధికారులు అడ్మినిస్ట్రేషన్ పై శ్రద్ద వహించాలి. లీప్ యాప్ ద్వారా పనివిధానాన్ని మెరుగుపర్చుకోవాలి. గతంలో విజిబిలిటీ లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం విధానానికి లీప్ యాప్ కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా,  మండల, స్కూలు స్థాయిలో ఒకేవిధమైన డేటా ఉండాలి. లక్ష్యసారూప్యత ఉండాలి. డ్యాష్ బోర్డుపై శ్రద్ధపెట్టాలి. ఇదంతా పూర్తయ్యాక పబ్లిక్ డ్యాష్ బోర్డుకు యాక్సెస్ ఇస్తాం. పాల్, ఏఐ బేస్ లెర్నింగ్, ఏఐ ట్యూటర్ త్వరలోనే అమలు చేయబోతున్నాం.నైతిక విలువలు ముఖ్యంటెక్నాలజీతోపాటు నైతిక విలువలు చాలా అవసరం. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారికి కేబినెట్ హోదాతో అడ్వయిజర్ గా పెట్టాం. ప్రతి శనివారం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పై దృష్టిపెట్టాలి. ఒక సోషల్ మీడియా పోస్టులో కొడుకు తల్లిని చంపే పరిస్థితి చూశాను. నైతిక విలువల బోధనతో ఇటువంటి ఘటనలను నివారించే అవకాశముంది. విద్యాశాఖపై పవిత్రమైన బాధ్యత ఉంది. జెండర్ సెన్సిటివిటీ కూడా చాలా ముఖ్యం. ఉపాధ్యాయులకు ఎక్స్ పోజర్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాం, యోగా, స్పోర్ట్స్ పై శ్రద్ధ పెడుతున్నాం. స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. శాప్ ద్వారా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. విద్యాశాఖ వద్దని చాలామంది నన్ను వారించినా సమాజంలో నేను ఆశించిన మార్పు విద్యతోనే సాధ్యమని నమ్మి ఈ శాఖను తీసుకున్నాను. నూరుశాతం ఫలితాలు సాధించినపుడే నేను విద్యాశాఖ మంత్రిగా సంతృప్తి చెందుతా. అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పవిత్ర బాధ్యత మనందరిపై ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.రెండేళ్లలో విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులుహెచ్ఆర్ డీ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ... పాఠశాల విద్య భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటుచేశాం. గత రెండేళ్లలో పాఠశాల విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని సంస్కరణలు చూశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అనేకసార్లు మంత్రి లోకేష్ గారు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షించి దశ,దిశ నిర్దేశించారు. ఒక్కోసారి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించారు. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు నిరంతరం చర్చలు జరిపారు. రెండేళ్లలో విద్యాశాఖలో గుణాత్మకమైన మార్పులు తెచ్చిన మంత్రిగారికి ధన్యవాదాలు. కఠినమైనప్పటికీ వాస్తవాన్నే చెబుదాం, మంత్రి గారు ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటివరకు ముందుకుసాగాం. కొంతవరకు సఫలీకృతమయ్యాం. ఇప్పుడు మనం సంస్కరణల దశ నుంచి కన్సాలిడేషన్ వైపు వెళ్తున్నాం. ఈ స్థితిలో ఎదుగుతున్న మొక్కను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే వరకు నిర్విరామంగా కృషిచేయాలి. లక్ష్యాలపై క్లియర్ డెడ్ లైన్ పెట్టుకొని జవాబుదారీతనంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి తమీమ్ అన్సారియా, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు

KIRAN BABU · 3 వారాల క్రితం · Andhra Pradesh, Guntur
వార్తలు

బాల్య వివాహాలు.. బాలికల మానసిక వికాసానికి అవరోధాలు

--కాగితాలపై సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి--వప్పంగి గ్రామంలో 'నల్సా ఆశా' 100 రోజుల కార్యాచరణ సదస్సుశ్రీకాకుళం, మే 20:చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు మానసిక వేదనకు గురికావడమే కాకుండా, వారి శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె. హరిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక వప్పంగి గ్రామంలో 'నల్సా ఆశా-2025', 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల అటు తల్లికి, ఇటు పుట్టబోయే బిడ్డకు ప్రాణసంకటంగా మారుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో గ్రామీణ మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు చట్టపరమైన అంశాలపై హరిబాబు దిశానిర్దేశం చేశారు. వివాహ సమయంలో వరకట్న వేధింపుల నుంచి రక్షణకు, ఆస్తిలో హక్కులు పొందేందుకు తగిన పత్రాల ద్వారా చట్టపరమైన రక్షణ పొందవచ్చని వివరించారు. అక్షరాస్యత లేని అమాయక ప్రజల వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని దళారులు, వడ్డీ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అంగీకార పత్రాలపై అయినా సంతకాలు చేసేటప్పుడు నమ్మకమైన వ్యక్తులతో పూర్తిగా చదివించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాల్సి వస్తే జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని, లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జి. శ్రీనివాసరావు, ఎ.జె. ఆదిల్ షా, న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

RAMA RAO · 3 వారాల క్రితం · Andhra Pradesh, Vizianagaram
వార్తలు

యువతకు నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ ముగిసిన ఎన్ సి సి శిబిరం

సబ్బవరం :యువతకు శక్తినిస్తూ – నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ ముగిసింది ఎన్ సి సి శిబిరం. బుధవారం ఉదయం అనకాపల్లి జిల్లా సబ్బవరం లో ఉన్న దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం లో అద్భుతమైన ఎన్ సి సి పాసింగ్ అవుట్ పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో 10 రోజుల వార్షిక శిక్షణ శిబిరం ముగిసింది. యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన శిక్షణ క్యాడెట్ల కు బాగా ఉపకరిస్తుంది. శిబిరం చివరి రోజు ఉత్సాహభరిత వాతావరణంలో అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఘన పరేడ్‌ను గ్రూప్ కమాండర్ కమోడోర్ సుమంత రాయ్ సమీక్షించారు. ఐదు విభిన్న దళాలుగా పాల్గొన్న క్యాడెట్లు అత్యంత క్రమశిక్షణతో, సమన్వయంతో ప్రదర్శించిన డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పరేడ్‌కు సీనియర్ అండర్ ఆఫీసర్ ఈశ్వర్ రావు నాయకత్వం వహించారు.పరేడ్ అనంతరం కమోడోర్ సుమంత రాయ్ మాట్లాడుతూ, క్యాడెట్ల అద్భుతమైన ప్రదర్శనను అభినందించారు. శిబిరంలో నేర్చుకున్న క్రమశిక్షణ, పర్యావరణ చైతన్యం, జీవిత నైపుణ్యాలు భవిష్యత్తులో వారిని ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.10 రోజుల శిబిరంలోని ముఖ్యాంశాలు :సైనిక మరియు వ్యూహాత్మక శిక్షణలు క్యాడెట్లు ఆయుధ వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ పొందారు. .22 రైఫిల్‌తో ఫైరింగ్ సాధన నిర్వహించబడింది. మ్యాప్ రీడింగ్ ద్వారా భూభాగ అవగాహన, అలాగే అడ్డంకుల శిక్షణ ద్వారా శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నారు.నౌకాదళ మరియు వారసత్వ అవగాహన క్యాడెట్లు ఐఎన్ఎస్ కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం, నావల్ మ్యూజియంను సందర్శించి భారత నౌకాదళ చరిత్ర, సముద్ర రక్షణ వైభవం గురించి తెలుసుకున్నారు.పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో విత్తన బంతులు తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సంకల్ప ఆర్గానిక్ విలేజ్ సందర్శనతో పాటు భారీ వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటిచెప్పారు.ప్రాణరక్షణ నైపుణ్యాలు మరియు నిపుణుల ఉపన్యాసాలు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ విశాఖపట్నం, అగ్నిమాపక శాఖ బృందాలు విపత్తు నిర్వహణ, అగ్నిప్రమాద నియంత్రణ వంటి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చాయి.మేధో, క్రీడా పోటీలు క్యాడెట్ల మధ్య క్రీడా పోటీలు, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించారు.సాంస్కృతిక ముగింపు కార్యక్రమం అధికారిక పరేడ్ అనంతరం శిబిరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. సంగీతం, నృత్యం, నాటికల ద్వారా క్యాడెట్లు తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించి, 10 రోజుల పాటు ఏర్పడిన ఐక్యత, స్నేహభావం, భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించారు.ఈ కార్యక్రమంలో న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాష్ చేతులు మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ పదిరోజులు శిక్షణ కార్యక్రమాలు లెఫ్ట్ నెంట్ కల్నల్ నీరజ్ కుమార్ అధ్యక్షతన జరిగాయో. ఈ కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్వర్ణిం ప్రభాత్, సుభేదార్ మేజర్ డి రాజేంద్రన్, సుభేధార్ ఆర్డినరీ కెప్టెన్ జి శ్రీధర్, మేజర్ కళ్యాణ్ అశోక్, లెఫ్ట్ నెంట్ వి సన్యాసి నాయుడు, లెఫ్ట్ నెంట్ ఉదయ్ కిరణ్, చీఫ్ ఆఫీసర్ లత, కుమార్ చంద్ర గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.

RAJ · 3 వారాల క్రితం
వార్తలు

తీరం... బోటు.. వేట...మనవే : సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా   : మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “ఉవ్వెత్తున ఎగిసిపడే అలలకు ఎదురెళ్లాలంటే గుండె ధైర్యం కావాలి.. అది మత్స్యకారుల సొంతం” అని చంద్రబాబు పేర్కొన్నారు. వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 37 వేల మంది మత్స్యకారుల ఖాతాల్లో నగదు బదిలీ చేసినట్లు వెల్లడించారు. గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువ మందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.మత్స్యకారుల అభివృద్ధి కోసం సముద్ర సంపదను సమర్థంగా వినియోగిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా ఆధారపడే రంగం మత్స్య సంపదేనని పేర్కొన్నారు. మెకనైజ్డ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు సబ్సిడీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. అందులో రాజీ లేదు.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం” అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల బోట్లు తీరంలోకి వస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా ఇతర రాష్ట్రాల బోట్లు వచ్చిన వెంటనే కలెక్టర్లకు సమాచారం అందే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.మత్స్యకారుల కోసం మరో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తామని, వాటికి రాయితీలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏపీ కోస్తా తీరాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, సీ ఫుడ్‌లో అధిక ప్రోటీన్ ఉంటుందని, సమతుల ఆహారంగా అది ఎంతో ఉపయోగకరమని సీఎం పేర్కొన్నారు. “నేను కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మత్స్యకారులకు మార్కెట్ మేనేజర్‌లా పనిచేస్తానని, సీ ఫుడ్‌కు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు.కోస్తా తీరంలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం పోర్టుల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ పోర్టుల నిర్మాణం ద్వారా మత్స్యకారుల్లో నిరుద్యోగ సమస్య తగ్గి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో నీటితో పాటు చేపలు కూడా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. మత్స్యకారులకు GPS సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను GPS ద్వారా గుర్తించే సాంకేతికత మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అక్రమ వేటపై కూడా నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు.ఆక్వా రంగానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం పేర్కొన్నారు. గత ఏడాది రూ.803 కోట్ల సబ్సిడీ ఇస్తే, ఈసారి రూ.843 కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. దేశంలోని మొత్తం ఆక్వా ఎగుమతుల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయని చెప్పారు. మత్స్యకారులను ఆదుకోవడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో తాను మరియు పవన్‌ కల్యాణ్‌ కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు  స్పష్టం చేశారు.

CHANDU · 4 వారాల క్రితం · Andhra Pradesh, Nellore
వార్తలు

ఎల్ లినో ప్రభావంతో లోటు వర్షపాతం

  --- నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం!                      -- సాధారణ వర్షం కంటే తక్కువగా 92 శాతం నమోదయ్యే అవకాశం  --తూర్పు గాలులతో ఉత్తరాంధ్రకు డోకా లేదు .    (  డా. ఎం. ఆర్. ఎన్. వర్మ, సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నం )                భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ముఖ్యంగా రైతాంగం నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తారు. అయితే ఈ పరిస్థితికి భిన్నంగా వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం 2026 సంవత్సరంలో ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు పడనున్నాయి.ఏడాది మొత్తం సగటున వర్షపాతం కంటే లోటుతో 92 నుంచి 94 శాతం లోపే ఉంటుందని  వాతావరణ అధ్యయన సంస్థల అంచనా . పసిఫిక్ మహాసముద్రంలో మధ్య-తూర్పు భాగంలో సముద్రపు నీరు పై భాగంలో సాధారణం కంటే ఎక్కువ వేడెక్కడం నమోదయింది. అన్ని సముద్రాలు కన్నా పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది. భూమధ్య రేఖకు 30 డిగ్రీల పై భాగంలో ఏర్పడేటువంటి పరస్పర చర్యలు ఇతర సముద్రాలపై ప్రభావం ఉంటుంది. తూర్పు దిశ నుండి పడమటి దిశగా గాలివాటం ఉంటుంది. గాలులు బలహీనమైనప్పుడు, గాలి దిశ మార్చుకుంటుంది. హిందూ సముద్రంలో అధిక పీఠం ఉంటుంది. అధిక పీడనం నుంచి అల్పపీడనం కలిగినటువంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతానికి అవకాశం ఉంటుంది. అల్పపీడనం బలహీన పడితే వేడి తగ్గి ఎలినో అధిక పీడనాన్ని ఎక్కువ ఆకర్షిస్తుంది.  దీంతో ఎల్ నినో ప్రభావంతో ఎక్కువ ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి . ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా భారతదేశానికి ప్రకృతి సహజసిద్ధంగా  నీటికి వరంలా ఉండే నైరుతి , ఈశాన్య రుతుపవనాలు ఎల్ లినో దెబ్బకు బలహీనపడే అవకాశా లు ఉన్నాయి. 2026 ఏడాది నైరుతి రుతుపవనాల రాక సందర్భంలోనే ఎల్ లినో ప్రభావం సమాంతరంగా కొనసాగుతుంది. మే మాసం నుంచి జూలై మాసం  మధ్య లో ఎలినో  ప్రభావం ప్రారంభమైనప్పటికీ, ఏడాది చివరి నాటికి ఎల్ లినో బలంగా ఒక దశలో సూపర్ ఎల్ లినోగా ( మరింత బలంగా) మారే అవకాశాలు దాదాపు 66 శాతం  స్పష్టంగా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 శాతం అధికంగా నమోదవుతున్నాయి. 1950 నుండి ఇప్పటివరకు గడిచిన 76 సంవత్సరాల కాలంలో దాదాపు 16 సార్లు ఎల్ లినో ప్రభావం నమోదైనప్పటికీ  తొమ్మిది సార్లు మాత్రమే  ప్రతికూల పరిస్థితి  ప్రభావాలు చూపింది. 2009 లో బలహీనమైన ఎల్ లినో ప్రభావం ఉన్నప్పటికీ ఆ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగా 78.2 శాతం వర్షపాతం నమోదైంది. దాదాపు 37 సంవత్సరాల లో అతి తక్కువగా ఆ ఏడాది వర్షం  నమోదు అయింది. 2026లో ఎల్ లినో ప్రభావం బలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది . దేశంలో లోటు వర్షపాతం ఉత్తర, మధ్య, పశ్చిమ భారత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఇండోర్, గ్వాలియర్, గుజరాత్, మహారాష్ట్రలో సాధారణ కంటే అతి తక్కువ వర్షాలు నమోదు అవుతాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రాయలసీమ ప్రాంతంలో కొంత లోటు వర్షపాతం ఉన్నప్పటికీ, కోస్తాంధ్ర,ఉత్తరాంధ్రకు తూర్పు గాలుల ప్రభావంతో లోటు వర్షం లేకుండా, సాధారణ వర్షాలు కంటే అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.  ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ లో ప్రవేశించాయి. ఈసారి అతి త్వరగా ఈ నెల 26న దేశంలో కేరళ రాష్ట్రాన్ని సాధారణం కంటే వారం ముందుగా... వరుసగా మూడవ ఏడాది కూడా ముందస్తుగానే నైరుతి రుతుపవనాల ఆగమనం జరుగుతోంది.దేశంలో దాదాపు 50% పైగా రైతాంగం వర్షాధారిత వ్యవసాయo పై ఆధారపడతారు. రైతులు ఈ ఏడాది ఎల్ లినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలు వేయకపోవడం మంచిది. ఖరీఫ్ సీజన్లో వేసే పంటలు వరి,పత్తి,పప్పు ధాన్యాలు వేయడం వలన దిగుబడి తగ్గుదలకు అవకాశం ఉంది. " ఉత్తరాంధ్రలో  వర్షానికి డోకా లేదు ఈ ఏడాది ఎల్ లినో ప్రతికూల ప్రభావంతో దేశంలో రాష్ట్రంలో వర్షాలు పరిస్థితి ఎలా ఉన్నా, తూర్పు గాలుల పుణ్యమా అని  ఉత్తరాంధ్రలో సాధారణ వర్షాల కంటే ఒక మోస్తారు ఎక్కువ వర్షాలు నమోదుకు అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు నైరుతి రుతుపవనాల సమయంలో ఏర్పడడం వల్ల వాయుగుండం నేరుగా ఉత్తరాంధ్ర తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్రలో మెండుగా వర్షానికి అవకాశం ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. చరిత్రలో 2015 నాటి సూపర్ ఏలినో ప్రభావం తో తీవ్ర లోటు వర్షం దేశంలో నమోదైనప్పటికీ , ఆనాడు తూర్పు గాలుల  పుణ్యమా అని ఉత్తరాంధ్రలో లోటు లేకుండా సాధారణ వర్షాలే నమోదు కాబడింది. ఉత్తరాంధ్రలో జూన్ మొదటి వారం తర్వాత రెండో వారం లోపల నైరుతి రుతుపవనాలు ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు ప్రారంమవుతాయి. జూలై నుండి అల్పపీడనాలు,వాయుగుండం ప్రభావంతో ఈఏడాది సాధారణంగా అంటే ఎక్కువ భారీ వర్షాలకు సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో సగటున 1100 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉంది. సాధారణంగా అదనంగా వర్షాలు పడం వల్ల 1200 మిల్లీమీటర్లుగా నమోదు కాబడి, నీటికి లోటు లేని పరిస్థితి ఉంటుంది. జూన్ 15వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలో నాట్లు వేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. లోతట్టు  ప్రాంతాల్లో తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలు మంచిదని, మెట్ట ప్రాంతాల్లో చెరుకు, పసుపు మొక్కజొన్న పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర రైతాంగానికి ఖరీఫ్ సీజన్లో నీటికి ఇబ్బంది  ఉండకపోవచ్చు కానీ, రబీ సీజన్లో తేమ శాతం తగ్గి పంటలు దిగుబడి తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఎలినో ప్రభావంతో ఈ ఏడాదికి  ఉత్తరాంధ్రలో కరువు ఏర్పడే అవకాశాలు లేవు.

( డా. ఎం. ఆర్. ఎన్. వర్మ, సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నం ) · 4 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)